- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
గాంధీ ఆస్పత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీ
దిశ, వెబ్ డెస్క్: మహానగరంలో ఎడతెరిపి లేకుండా మూడు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ముసురు కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు నిండిపోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆస్పత్రిలో బెడ్ల వివరాలు, ఓపి రోజు వారి వివరాలు సుపరింటేండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. స
మంత్రి ఆకస్మిక తనిఖీ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఎంతమంది డాక్టర్లు డ్యూటీ లో ఉన్నారని సమాచారం అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నర్సింగ్ సిబ్బంది, డయాగ్నస్టిక్, క్లినికల్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.