Mettu Saikumar: జంతర్ మంతర్ వద్ద దర్నాలో పాల్గొన్న తెలంగాణ ఫిషరీష్ చైర్మన్

by Ramesh Goud |
Mettu Saikumar: జంతర్ మంతర్ వద్ద దర్నాలో పాల్గొన్న తెలంగాణ ఫిషరీష్ చైర్మన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ఇందులో బీజేపీ ప్రభుత్వం మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లుల పట్ల నిరసన తెలియజేశారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందని.. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా.. ఫిషర్మెన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఫర్నేడో, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ ప్రతాపన్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story