కాంగ్రెస్‌కు షాక్.. సీఎం ఫ్లెక్సీల తొలగింపు

by Disha Web Desk 23 |
కాంగ్రెస్‌కు షాక్.. సీఎం ఫ్లెక్సీల తొలగింపు
X

దిశ,కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: కంటోన్మెంట్ లో ఎన్నికల విభాగం కాంగ్రెస్ కు షాకిచ్చింది. సీఎం రోడ్ షో కోసం పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలగించారు. వివరాల్లోకి వెళ్లితే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్నా నగర్ , రసూల్ పూర్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత రోడ్ షో ఉంది. ఈ నేపథ్యంలో లోకల్ లీడర్లు సీఎం దృష్టిలో పడేందుకు భారీ ఎత్తున ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు రంగంలోకి దిగారు. ప్లెక్సీలను తొలగించారు. దీంతో సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే, మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ మైనంపల్లి హన్మంతరావు ప్లెక్సీలను తొలగించద్దని కోరారు. సీఎం సభ వరకు ఉంచాలని అభ్యర్థించారు. అయినా అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు .. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్లెక్సీలను ఏర్పాటు చేయరాదని సూచించారు.



Next Story

Most Viewed