కిరాణా షాపులో యధేచ్చగా గంజాయి చాక్లెట్స్ విక్రయం

by Anjali |
కిరాణా షాపులో యధేచ్చగా గంజాయి చాక్లెట్స్ విక్రయం
X

దిశ, కుత్బుల్లాపూర్ : కిరాణా షాపులో చాక్ లెట్స్ మాటున గంజాయి దందా నిర్వహిస్తున్న ఉదంతానికీ పోలీసులు చెక్ పెట్టారు. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో గల లెనిన్ నగర్ కిరాణా షాపులో సునీతా దేవి గోస్వామి అనే మహిళ గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి చాక్ లెట్స్ విక్రయిస్తుంది. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ ఓ టీ పోలీసులు ఆ కిరాణా షాప్ పై మంగళవారం దాడులు నిర్వహించారు. దాడులలో 9.5 కిలోల గంజాయిని చాక్ లెట్స్ దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకుని కిరాణా షాప్ నిర్వహిస్తున్న సునీతా దేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జగద్గిరిగుట్ట పోలీసులకు ఎస్ ఓటీ అధికారులు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed