కారు గుర్తుకు ఓటేసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

by Disha Web Desk 15 |
కారు గుర్తుకు ఓటేసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
X

దిశ,ఉప్పల్ : కారు గుర్తుకు ఓటేసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజిని లక్ష్మారెడ్డి కోరారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గ పరిధి నాచారం డివిజన్ లో గల సార్వర్కర్ నగర్, హనుమాన్ నగర్ లో భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు.

అనంతరం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్, సీనియర్ నాయకులు సాయిజన్ శేఖర్ తో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ మేకల ముత్యం రెడ్డి, టేకులపల్లి రామచందర్, భూపాల్ రెడ్డి, కట్ట బుచ్చన్న, గుజ్జారి చంద్రశేఖర్, అశోక్, దేవులపల్లి యాదగిరి, వాసు మహిళా అధ్యక్షురాలు ప్రీతి రెడ్డి, బాలమణి, కామేశ్వరి పాల్గొన్నారు.



Next Story

Most Viewed