భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. కాంగ్రెస్ రాష్ట్రనేత కూన శ్రీశైలం గౌడ్..

by Sumithra |
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. కాంగ్రెస్ రాష్ట్రనేత కూన శ్రీశైలం గౌడ్..
X

దిశ, కుత్బుల్లాపూర్ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూనని తన నివాసం వద్ద నిజాంపేట్ పరిధి కౌసల్య కాలనీ, దుండిగల్ పరిధి కార్తికేయ నగర్ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దానికి మాజీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. పలువురు పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి అయితేనే బయటికి రావాలని సూచించారు. నాళాలు డ్రైనేజీలు, పొంగిపొర్లే అవకాశాలు ఉన్నాయని, విద్యుత్ స్తంభాలకు కరెంట్ తీగలకు, పాడుబడ్డ భవనాలకు దూరంగా ఉండాలని ప్రజలని కోరారు. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్తు శాఖల అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed