ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం..

by Kalyani |
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం..
X

దిశ, మేడిపల్లి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పీర్జాదిగూడ సాయి ఐశ్వర్య కాలానికి చెందిన జీవన్ ప్రభుత్వ ఉద్యోగి, తన భార్య మునవత్ వీణ (35), వీరి ఇద్దరు కుమారులు సంహిత్ (9), శ్రీమన్విత (7) లను ఈ నెల 6 వ తేదీన స్కూల్ నుంచి తమ పిల్లలను తీసుకువస్తానని వెళ్లి పిల్లలతో సహా ఇంటికి తిరిగి రాలేదని భర్త జీవన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలియజేశారు.

Advertisement

Next Story