Koona Srisailam Goud : కుత్బుల్లాపూర్ గల్లీల్లో వివేక్‌ను ఉరికిచ్చి కొడుతాం

by Aamani |
Koona Srisailam Goud :  కుత్బుల్లాపూర్ గల్లీల్లో వివేక్‌ను ఉరికిచ్చి కొడుతాం
X

దిశ,కుత్బుల్లాపూర్ : సీఎం రేవంత్ రెడ్డి పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ను గల్లీలో ఉరికించి కొడతామని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హెచ్చరించారు.టీడీపీ లో గెలిచి తన స్వార్థం, ప్రయోజనం కోసం టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కు పార్టీల మార్పు పై మాట్లాడే నైతిక హక్కు లేదని కూన శ్రీశైలం గౌడ్ మండి పడ్డారు.రాష్ట్రంలో భద్రత గురించి, పార్టీ పిరాయింపు లపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద సీఎం ను ఆరోపిస్తే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తీవ్రంగా హెచ్చరించారు.వివేక్ ఎన్నికల ముందు నువ్వు నాపై దాడికి వచ్చినవ్...నాకు సంస్కారం ఉండి నీపై తిరిగి దాడి చేయలేదు అది మా సంస్కారం అని ప్రస్తుత ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు మాజీ ఎమ్మెల్యే కూన.

రాష్ట్రంలో భద్రత గురించి నువ్వా మాట్లాడేది, నీ భాష మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్ లో తిరగనివ్వం అంటూ గద్దించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరించిన ఆయన అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ వివేకానంద పై నిప్పులు చెరిగారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed