మోడీ హయాంలో రైల్వే స్టేషన్లు ఎయిర్ పోర్ట్‌లను తలపిస్తున్నాయి: ఈటల రాజేందర్

by Disha Web Desk 12 |
మోడీ హయాంలో రైల్వే స్టేషన్లు ఎయిర్ పోర్ట్‌లను తలపిస్తున్నాయి: ఈటల రాజేందర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం రూపురేఖలు మారుతుందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఓల్డ్ బోయిన్ పల్లిలోని స్వర్ణధామ నగర్ కాలనీ, యాప్రాలలోని మణి కంఠ కాలనీలో జరిగిన బ్రెక్ ఫాస్ట్ మీటింగ్‌లలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 76 ఉన్న విమానాశ్రయాలు 153 కి పెరిగాయన్నారు. రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. భారత్‌లో పేదలకు 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచినట్లు తెలిపారు.

నిత్యం అధికారం కోసం కాకుండా.. ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి నరేంద్ర మోడీ అని తెలిపారు. ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదని, ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలన్నారు. 500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రామమందిరాన్ని నిర్మించారని తెలిపారు. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11 వ స్థానంలో ఉన్న భారత్‌ను 5 వ స్థానానికి తీసుకువచ్చారు. మళ్ళీ అవకాశం ఇస్తే మూడవ స్థానానికి తీసుకువస్తా అని హామీ ఇస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికలను దేశం కోసం, జాతీయత కోణంలో చూడాలని కోరారు. దేశం సుస్థిరంగా ఉండాలంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోడీని జోక్యం చేసుకోవాలని రష్యా లేఖ రాసింది అంటే అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

నేను నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా సేవకుడిని: ఈటల రాజేందర్

నేను రాజకీయ నాయకుడిని, సేవ చేయడానికి పోలిటీకల్‌లోకి వచ్చానని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదని తెలిపారు. మీకు నిత్యం అందుబాటులో ఉంటానని, తనను సంపూర్ణంగా ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ముందుగా ఈటల రాజేందర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు సరస్వతి జ్ఠాన మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో స్వర్ణధామ నగర్ కాలనీ ప్రెసిడెంట్ రాఘవేందర్ రావు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి.ప్రభాకర్ రావు, కార్యనిర్వహక కార్యదర్శులు రాయల మోహన్ రావు, టి,వి సురేష్, ఉపాధ్యక్షులు విద్యాసాగర్, కోశాధికారి గోపాల్, కాలనీ వాసులు రామలింగారెడ్డి, ఉమ్మారెడ్డి, మల్లారెడ్డి,కొమ్మినేని సీతారాం, వర్ధన్ రావు,అభిలాష్, కన్నా, శివ,రాజేశ్వరి, మాధవి, భవాని, స్వప్న, స్వర్ణ, జనసేన కూకట్ పల్లి ఇన చార్జీ ప్రేమ్ కుమార్, బీజేపీ నాయకులు పప్పు పటేల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మణి కాలనీ డివిజన్ ప్రెసిడెంట్ డా. సత్యనారాయణ, ముదిగంటి రవీందర్ రెడ్డి, ప్రసన్న, రాజు, మిలటరీ కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు.

Next Story

Most Viewed