- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > అధికారులు ప్రజా సమస్యలు తెలుసుకుని ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎమ్మెల్యే
అధికారులు ప్రజా సమస్యలు తెలుసుకుని ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎమ్మెల్యే
by Sumithra |
X
దిశ, కూకట్పల్లి : అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కిరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట్ డివిజన్ పరిధిలోని అవంతినగర్ తోటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాలనీలో తాగునీటి సమస్య ఎదురవుతుందని, అదే విధంగా డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందని అన్నారు. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు, బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్, సత్యం, తిరుపతి, నరసింహ రెడ్డి, వెంకటేశ్వర్లు, సుశీలు కుమార్, యాదవ దేవేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story