కుషాయిగూడ ‘శాంతివనంలో అశాంతి’

by Aamani |
కుషాయిగూడ ‘శాంతివనంలో అశాంతి’
X

దిశ, కాప్రా : కుషాయిగూడ శాంతి వనం లో చావును కూడా శాంతిగా చేయలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుషాయిగూడ స్మశాన వాటిక పేరు శాంతివనమైనప్పటికీ ఇక్కడ మొత్తం అశాంతికి నిలయం గా మారిపోయింది. తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది. ఎవరైనా చనిపోతే అంతిమ దహన సంస్కారాలు చేయాలంటే స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట దోచుకుంటారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఒక్కో చావుకు రూ. 25 వేల నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలీ చాలని కట్టెలతో అంతిమ దహన సంస్కారాలు చేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధులు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట రూ. 25 వేల నుంచి రూ.40 వేల రూపాయలు చెల్లించుకోలేక అనేక కుటుంబాలు గోసపడుతున్నాయని వివరించారు. చాలీచాలని కట్టెలతో అధ్వానంగా అంతిమ సంస్కారాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కుషాయిగూడ స్మశాన వాటిక నిర్వహణ పై దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed