తాళం వేసిన ఇంట్లో చోరీ…4 లక్షలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు

by Kalyani |
తాళం వేసిన ఇంట్లో చోరీ…4 లక్షలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు
X

దిశ, నవీపేట్ : అప్పు తీర్చడానికి తీసుకొచ్చిన 4 లక్షల సొమ్మును దొంగిలించిన ఘటన నవీపేట్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు నవీపేట్ మండల కేంద్రం సుభాష్ నగర్ లో నివాసం ఉండే సయ్యద్ మీర్ బీడీ కంపెనీ లో పనిచేస్తున్నాడు. అప్పు తీర్చడం కోసం చిట్టి డబ్బులు తీసుకొని ఇంట్లో బీరువాలో పెట్టి బంధువులను పరామర్శించేందుకు నందిపేట్ కు వెళ్లారు. సోమవారం రాగా ఇంటి తలుపులు పగలగొట్టి, బీరువా తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా 4 లక్షలు చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై యాదగిరి గౌడ్ డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed