తెలంగాణలో 13 జిల్లా గ్రంథాలయాలకు చైర్మన్ల నియామకం

by Y. Venkata Narasimha Reddy |
తెలంగాణలో 13 జిల్లా గ్రంథాలయాలకు చైర్మన్ల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్లకు నాగుల సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ కు సత్తు మల్లయ్య, రంగారెడ్డికి ఎలుగంటి మధుసూధన్ రెడ్డి, వనపర్తికి జి. గోవర్ధన్, సంగారెడ్డికి గొల్ల అంజయ్య, కామారెడ్డికి మద్ది చంద్రకాంత్ రెడ్డిలను చైర్మన్ గా నియమించింది. మెదక్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సుహాసిని రెడ్డి, నారాయణ్ పేట్ కు వర్గాల విజయ్ కుమార్, నాగర్ కర్నూల్ జి. రాజేందర్,

వికారాబాద్ కు శేరి రాజేశ్ రెడ్డి, మహబూబ్ నగర్ కు మల్లు నరసింహారెడ్డి, జోగులాంబ గద్వాల చైర్మన్ గా నీలి శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నియామకాలతో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకులలో కొందరికి పదవుల భాగ్యం దక్కింది.

Advertisement

Next Story