డీసీఎం వ్యాన్,లారీ ఢీ..ఒకరు మృతి మరొకరికి గాయాలు

by Naveena |
డీసీఎం వ్యాన్,లారీ ఢీ..ఒకరు మృతి మరొకరికి గాయాలు
X

దిశ భిక్కనూరు : భిక్కనూరు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ప్లాస్టిక్ బాక్స్ ల లోడ్ తో ఆదిలాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాన్..ముందుగా వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలోఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ కు చెందిన అబీద్ అబ్దుల్ (36), క్లీనర్ గొండల్ వార్ సంతోష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ డైవర్ అబ్దుల్ అక్కడికక్కడే మరణించాడు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ అబ్దుల్ నియంత్రణ లేని వేగంతో..డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందని క్లీనర్ సంతోష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed