- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
దిశ, సినిమా: స్టార్ హీరో అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాను ముదస్సిర్ అజీజ్ తెరకెక్కించగా.. ఇందులో వాణి కపూర్, అమ్మి విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రం ఆగస్టు 15న థియేటర్స్లో విడుదలై డిజాస్టర్గా నిలిచింది.
అయినప్పటికీ తొందరగా ఓటీటీలోకి రాకుండా దాదాపు రెండు నెలల తర్వాత అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా, ‘ఖేల్ ఖేల్ మే’ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది.
#KhelKhelMein (Hindi) Streaming from October 9th on Netflix #OTT_Trackers pic.twitter.com/3uPdl5ml3t
— OTT Trackers (@OTT_Trackers) October 5, 2024