- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టైలే వేరు.. మెట్రోలో ఎన్నికల ప్రచారం చేస్తూ..
దిశ, మేడ్చల్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు వినూత్న ప్రచారానికి తెరలేపారు. గురువారం మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎంఎల్సి, ఎంఎల్ఏలతో మెట్రోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్బి నగర్ నుండి కూకట్పల్లి వరకు మెట్రో రైలులో ప్రయాణం చేసి మెట్రో ప్రయాణికులను ఓటేయాలని అభ్యర్థించారు. హైదరాబాద్ అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు. ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేసింది కేటీఆర్ అని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి అధిక నిధులు తెస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా, శంబీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.