- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లారీని ఢీకొన్న బైక్… ఇద్దరు మృతి
దిశ, కల్వకుర్తి : లారీని బైక్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి మండల పరిధిలో చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామ గేటు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్రవాహనం.. రోడ్డు పక్కన ఆగి ఉన్న టిఎస్ 07 యుబి 7848 నెంబర్ గల లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వంగూర్ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (30), కల్వకుర్తి మండలం జిల్లెల గ్రామానికి చెందిన రాములు(24) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వంగూర్ మండలం తుమ్మల పల్లి గ్రామం నుంచి కల్వకుర్తి కి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని, మృతుడు వెంకటేష్ భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్ఐ మాధవరెడ్డి,రెండవ ఎస్ఐ రామచందర్ జి తెలిపారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా లారీని రోడ్డుపై ఆపడం ద్వారా ఈ ఘటన జరిగిందని వారన్నారు.