సంతానం కలగలేదనే కారణంతో భార్యను హత్య చేసిన భర్త..

by Disha Web Desk 11 |
సంతానం కలగలేదనే కారణంతో  భార్యను హత్య చేసిన భర్త..
X

దిశ, తాండూరు : సంతానం కలగలేదనే కారణంతో భర్త భార్యను హత్య చేసిన ఘటన కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ అశోక్ ల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ .. మార్చి 30వ తేదీన తాండూరు మండలం చంద్రమంచ గ్రామ శివారులోని కాగ్నా నదిలో అనుమానస్పందనంగా మృతి చెంది ఉన్న మహిళ శవాన్ని కరణ్ కోట్ పోలీసులు గుర్తించారు. మే 1వ తేదీన నైకోటి మల్లప్ప కరన్ కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్య చేసిన వ్యక్తి పరారీలో ఉన్నప్పటికీ పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి మే 5వ తేదీన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన బోయిని లక్ష్మప్ప తండ్రి శివప్ప కు బోయిని అనితతో గత 14 సంవత్సరాల కిందట వివాహం జరిగిందని వెల్లడించారు. భార్యాభర్తలు సంసార జీవితంలో బాగానే ఉన్నప్పటికీ సంతానం కలగడం లేదనే సాకుతో మృతురాలి భర్త అయినా లక్ష్మప్ప తన భార్య అనితను గత నాలుగు సంవత్సరాల నుండి వేధించడం, ప్రతి రోజు మద్యం సేవించి మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడని కర్ణాటక రాష్ట్రం చించోలి తాలూకా కల్బురిగి జిల్లా జెట్టూరు గ్రామ వాసి అయినా మృతురాలు తండ్రి నైకోటి తుల్జప్ప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా పోలీసులకు అసలు విషయం వెలుగులోకి తెచ్చినట్లు చెప్పారు.

ఇదే విషయంలో మృతురాలి భర్త నేరస్తుడు అయినా లక్ష్మప్ప తన బంధువు రాములుకు కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి రెండవ పెళ్ళి చేసుకునేందుకు అడ్డుగా ఉందని ఎలాగైనా అనితను చంపేస్తానని నా మాట వినట్లేదని చెప్పడంతో పాటు, తదుపరి ఎన్ని డబ్బులు ఖర్చు చేసైన కేసు నుండి తప్పించుకుంటా అనే విధంగా మాట్లాడినట్లు విచారణలో వెల్లడైందని డీఎస్పీ వివరించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తానేనని ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐ విఠల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed