- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విశాల జన సభ పేరిట ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పది సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పరిష్కరించినట్లు తెలిపారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఢిల్లీ కి తెలంగాణ రాష్ట్రంను ఏటీఎంగా మార్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే అన్నారు. కాలేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు విచారణ జరపలేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.