రైతుల కన్నీళ్లకు కారకుడైన వ్యక్తి కావాలో...సేవ చేస్తున్న వ్యక్తి కావాలో ఆలోచించండి

by Disha Web Desk 15 |
రైతుల కన్నీళ్లకు కారకుడైన వ్యక్తి కావాలో...సేవ చేస్తున్న వ్యక్తి కావాలో ఆలోచించండి
X

దిశ,దుబ్బాక : మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారం, రోడ్ షో దుబ్బాక నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. రాయపోలు మండలం అంబేద్కర్ చౌరస్తా నుంచి పలు కాలనీలు, సెంటర్ల మీదుగా రోడ్ షో కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముదిరాజ్ సంఘం, మత్స్యకారులు వినూత్నంగా చేపల వలతో ర్యాలీలో ముందుకు సాగారు. ప్రచార రథంపై దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని అభ్యర్థించారు.

బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం : మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే.. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించి గిఫ్ట్ ఇవ్వాలని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విజ్ఞప్తి చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో భాగంగా రాయపోల్ కార్నర్ మీటింగ్ లో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడారు. మన దేశం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ మండుటెండలో దేశమంతా 4500 కిలోమీటర్లు నడిచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఉత్తర భారతదేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ వేవ్ ఉందని ఇంటెలిజెన్స్, సర్వే రిపోర్ట్ లు చెబుతున్నాయని, రాష్ట్రంలో కూడా ఎంపీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో ఎలాగైతే దుర్మార్గ పాలనను తుద ముట్టించామో? ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయ ఢంకా ముగించేందుకు శ్రమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగేలా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలోనే బీసీ యువనేత నీలం మధు ముదిరాజ్ కు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. 80 శాతం బీసీలు ఉన్నామని, అవకాశాలు ఇవ్వడం లేదని ప్రతిసారి వేదికలపై చెబుతుంటామని, కానీ బీసీ బిడ్డ నీలం మధు రూపంలో అవకాశం వచ్చిందని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపిస్తే పార్లమెంటులో వెనుకబడ్డ జాతుల గొంతుక అయి అభివృద్ధికి దోహద పడతాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో కాంగ్రెస్ హామీలు అమలుతో పేదలకు మేలు జరిగిందన్నారు. ఎన్నికల తర్వాత దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి తన వంతుగా దోహదపడతానని తెలిపారు.

మీ బిడ్డగా వస్తున్న సేవ చేసేభాగ్యం ఇవ్వండి : నీలం మధు ముదిరాజ్

రైతుల కన్నీళ్లకు కారకుడైన వ్యక్తి కావాలో.. ప్రజల కోసమే సేవ చేస్తున్న వ్యక్తి కావాలో? ఒక్కసారి ఆలోచన చేయాలని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు అన్నారు. రాయపోల్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడారు. గరీబోళ్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. బీజేపీ మాత్రం ఆదాని అంబానీల కోసం పనిచేస్తోందన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ధరలు మరింతగా పెరిగిపోతాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలలో తనను గెలిపించండి.. మెదక్ ప్రాంత అభివృద్ధికి

పాటుపడతానని ఎంపీ అభ్యర్థి నీలం మధు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపల మహిళలకు ఫ్రీ బస్సు 500 కు గ్యాస్ సిలిండర్ గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంపు తదితర హామీలను అమలు చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన పనిచేస్తుందని, మరోసారి నిరూపించుకున్నామని తెలియజేశారు. మరో మరో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కావున ప్రజలకు ఎలాంటి పని జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

Next Story

Most Viewed