రామునిపట్లలో చోరీ.. రూ. 63 వేల నగదు, తులం బంగారం అపహరణ

by Kalyani |
రామునిపట్లలో చోరీ.. రూ. 63 వేల నగదు, తులం బంగారం అపహరణ
X

దిశ, చిన్నకోడూరు: దొంగలు పడి రూ. 63 వేల నగదు, 1 తులం బంగారం, 3 తులాల వెండి అపహరించిన సంఘటన చిన్నకోడూరు మండల పరిధిలోని రాముని పట్ల గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యసారేణి లక్ష్మయ్య 16వ తేదీ రోజున కామారెడ్డికి తన బిడ్డ వద్దకు వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ.63 వేల నగదు, 1 తులం బంగారం, 3 తులాల వెండి ని దొంగలు అపహరించినట్లు తెలిపారు. ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు లక్ష్మయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed