కంకర క్రషర్లను నివారించాలి.. ఎమ్మెల్యేకు గ్రామస్తుల వినతి...

by Sumithra |
కంకర క్రషర్లను నివారించాలి.. ఎమ్మెల్యేకు గ్రామస్తుల వినతి...
X

దిశ, జిన్నారం : జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామ శివారులో గల 286 సర్వేనెంబర్ గల అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసిన కంకర క్రషర్లను నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం రాళ్ల కత్వ గ్రామస్తులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రైతుల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను తీసుకొని, నిబంధనలకు విరుద్ధంగా కంకర క్రషర్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కంకర క్రషర్లతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే క్రషర్లను ఈ ప్రాంతం నుంచి తరలించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల్లో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed