- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
కంకర క్రషర్లను నివారించాలి.. ఎమ్మెల్యేకు గ్రామస్తుల వినతి...
by Sumithra |
X
దిశ, జిన్నారం : జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామ శివారులో గల 286 సర్వేనెంబర్ గల అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసిన కంకర క్రషర్లను నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం రాళ్ల కత్వ గ్రామస్తులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రైతుల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను తీసుకొని, నిబంధనలకు విరుద్ధంగా కంకర క్రషర్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కంకర క్రషర్లతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే క్రషర్లను ఈ ప్రాంతం నుంచి తరలించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల్లో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
Next Story