పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి

by Disha Web Desk 15 |
పార్లమెంట్ ఎన్నికల్లో  ఓటు హక్కును వినియోగించుకోవాలి
X

దిశ, సంగారెడ్డి : పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఓటు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఐబీ నుంచి ఎడ్ల బండితో ఓటు అవగాహన ర్యాలీ ప్రారంభించి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అఖిలాష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed