గణనాథుడి లడ్డూ కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు

by Kalyani |
గణనాథుడి లడ్డూ కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు
X

దిశ, సదాశివపేట: మండల పరిధిలోని నంది కంది గ్రామంలో మొట్టమొదటిసారి ఒక ముస్లిం సోదరుడు స్థానిక గ్రామస్తుడైన ఆనం ఖైస్ బుధవారం రాత్రి గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని రూ. 66 వేలకు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఖైస్ హర్షం వ్యక్తం చేస్తూ... హిందూ ముస్లింలు ఎప్పుడు సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా లడ్డూను దైవ భక్తితో స్వీకరించానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed