- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజా సేవకుడు బీబీ పాటిల్
దిశ, ఝరాసంగం : జహీరాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని బీబీ పాటిల్ కోడలు వచన పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఝరాసంగం, చిల్లేపల్లితండా, కమల్ పల్లి తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు వారి సమక్షంలో బీజేపీలో చేరారు. గత పది సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఇంటి వద్ద ఉండి విశ్రాంతి తీసుకోలేదని, నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యలు తీర్చేందుకు బీబీ పాటిల్ కృషి చేస్తున్నారని వచన పేర్కొన్నారు.
కరోనా సమయంలో రోగులకు సాయం అందించేందుకు 20 మంది సిబ్బందితో క్యాంప్ కార్యాలయంలో 24 గంటలు తెరిచి ఉంచారన్నారు. మర్మూర్, బిచ్కుంద, ఎల్లారెడ్డి, దోమకొండ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాలుగు అంబులెన్స్ అందించాలని వివరించారు. ఝరాసంగం సంగమేశ్వరాలయం, రేజింతల్ వినాయక ఆలయ, బోరంచ పోచమ్మ దేవాలయం తదితర ఆలయాల అభివృద్ధి కోసం (టూరిజం సర్క్యూట్) ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని, అది పరిశీలనలో ఉందని అన్నారు. బీబీ పాటిల్ ను మరోసారి గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓటర్లకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రజిని ప్రియ, విజయేందర్ రెడ్డి, ఉమాకాంత్ పాటిల్, సంతోష్ పాటిల్, సుభాష్ రావు, శంకర్ నాయక్, పాండు, మహిళలు సైతం పాల్గొన్నారు.