- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : మన చౌదరి
![ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : మన చౌదరి ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : మన చౌదరి](https://www.dishadaily.com/h-upload/2024/07/01/347945-21.webp)
దిశ,సిద్దిపేట ప్రతినిధి : ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వస్తారని అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండ ఎప్పటికప్పుడు పరిశీలిస్తు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ నాగరాజమ్మ, డిఆర్డిఓ పిడి జయదేవ్ ఆర్యా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 58 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.