- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం
దిశ, వెల్దుర్తి : బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ అన్నారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఓప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ బిడ్డనైన తనను ఆదరించి పార్లమెంటుకు పంపితే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మెదక్ గడ్డ ఇందిరమ్మ అడ్డా అని, ఇక్కడి నుండే ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచి దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో
బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీలు రెండు దఫాలుగా పాలనకొనసాగించినా నిరుపేదలకు సరైన సంక్షేమ పథకాలు అందించలేక పోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచారని, జరగబోయే ఎన్నికల్లో దమ్ము ధైర్యం ఉంటే ఎంపీగా గెలవాలని సవాల్ చేశారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, టికెట్ ఇస్తామని హరీష్ రావు నమ్మించి మోసం చేశారని, అందుకే తాను పార్టీ మారినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధును భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.