నీలం మధు గెలుపు తథ్యం

by Disha Web Desk 15 |
నీలం మధు గెలుపు తథ్యం
X

దిశ, చిన్నకోడూరు : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలవడం తథ్యం అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ అన్నారు. శుక్రవారం మైలారం గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, పేదవారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.

ఇందిరాగాంధీ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు దేశం కోసమే త్యాగం చేసిన ఘనత వారి కుటుంబానికి దక్కింది అన్నారు. పేద ప్రజలు కాంగ్రెస్ అంటేనే ఎక్కువ మక్కువతో ఓట్లు వేస్తారని ఆశాభవం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడి గా కాల్వ జగదీశ్వర్, ఉపాధ్యక్షుడిగా కుమ్మురాజుల ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా యారాకేష్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడుత జయంత్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed