మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్..

by Sumithra |
మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్..
X

దిశ, పటాన్ చెరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు.

నియోజకవర్గం వ్యాప్తంగా 35 వేల మంది లబ్ధిదారులకు సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, ప్రత్యేక అధికారి దేవూజ, ఎమ్మార్వో రంగారావు, ఎంపీడీవో యాదగిరి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed