పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..

by Vinod kumar |
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, పాపన్నపేట: అప్పుల పాలై పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన పాపన్నపేట మండల పరిధి కొంపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్సై మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి గ్రామానికి చెందిన బురిగాని సాయిలు(30) గత రెండు నెలల క్రితం అప్పు తెచ్చి వ్యవసాయ భూమిలో బోరు వేయించాడు. ఆ బోరు బావిలో నీరు పడకపోవడంతో అప్పులపాలై మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో మనస్థాపం చెందిన సాయిలు ఆగస్టు 22న ఉదయం 9 గంటల సమయంలో పొలంలో పురుగుల మందు సేవించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అటు నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మెదక్‌లోని రష్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ కోలుకోకపోవడంతో ఈనెల 3న సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడు భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story