దుబ్బాక ప్రజల త్యాగాలతోనే మల్లన్న సాగర్ : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

by Aamani |
దుబ్బాక ప్రజల త్యాగాలతోనే మల్లన్న సాగర్ : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
X

దిశ, మిరుదొడ్డి: ఎంతో మంది రైతుల ప్రయోజనం కోసం దుబ్బాక ప్రాంత ప్రజలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వారి భూములను త్యాగం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అలాంటి రైతులకు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణం పూర్తి చేసి చెరువుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా ఉమ్మడి మిరుదొడ్డి మండల కేంద్రంలోని అల్వాల, చెప్యాల, మిరుదొడ్డి కాసుల బాద్, మోతే, లింగుపల్లి, అక్బర్ పేట భూంపల్లి, గ్రామాలలో కోపరేటివ్ సొసైటీ, ఐకేపీ సెంటర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని పలు గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో పాటు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story