- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
MLA : అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలు వేయాలి
దిశ, సంగారెడ్డి : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటులో మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు లో మార్గదర్శకాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చాయి అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వివరించారు. మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, విజేందర్ రెడ్డి , ఆర్ వెంకటేశ్వర్లు, జీవీ శ్రీనివాస్, గుండు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.