పట్టాభూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణం..

by Sumithra |
పట్టాభూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణం..
X

దిశ, సంగారెడ్డి : తమ పట్టా భూమిలో కొందరు అక్రమంగా ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకుంటున్నారని న్యాయం చేయాలని కాశీపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ మహమూద్ విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 108/13/1 లో తన పేరు పై ఉన్న 14 గుంటల పట్టా భూమిని ఆక్రమించుకుని ప్లాట్లు చేస్తున్నారని తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. తన పేరు పై పట్టా పాస్ బుక్ ఉందని, పాసుపుస్తకం నంబర్ T09080110255 ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు.

కానీ తాము కుటుంబ పరిస్థితుల వల్ల హైదరబాద్ లో ఉంటున్నామని, ఇది అలుసుగా తీసుకున్న గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ భూమిని ఆక్రమించి అక్రమంగా ఇండ్లు నిర్మించుకుంటున్నారన్నారు. అక్రమంగా ఇండ్లు నిర్మించుకుంటున్నవారి పై చర్యలు తీసుకుని మా భూమి మాకు ఇప్పించాలని కంది మండల తహశీల్దార్ కు మహమూద్ వినతిపత్రం అందజేశారు.

Next Story

Most Viewed