పదేండ్లలో చేయని పనులను నేను పూర్తి చేస్తా : రఘునందన్ రావు

by Disha Web Desk 11 |
పదేండ్లలో చేయని పనులను నేను పూర్తి చేస్తా :  రఘునందన్ రావు
X

దిశ,చిలిపిచెడ్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా మండల కేంద్రమైన చిలిప్ చెడ్ లో బీజేపీ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ పాలనలో భూకబ్జాలు, అక్రమ కొనుగోల్లు, సారా దందాలు, ఇతరత్రా అక్రమాలకు పాల్పడి అభివృద్ధి సంగతే మరిచారని, ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదని, పదేండ్ల కాలంలోనే ఏం చేయలేకపోయారే...ఇప్పుడేం ఏం చేస్తారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి తీరుపై రఘునందన్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోతోక్కి వారి స్వలాభం కోసం ఆస్తులను పోగు చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్,, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు ఓటు వేయొద్దని, రెండు పార్టీలతో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను కూడా నెరవేర్చలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. దేశం కరోనా కాలంలో కొట్టుమిట్టాడుతుంటే దేశ ప్రధాని మోదీ వ్యాక్సిన్ ని తయారు చేసి దేశ ప్రజలతో పాటు ఇతర దేశాలకు సైతం అందించిన ఘనత దక్కించుకున్నాడని తెలిపారు.

గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఘన విజయం సాధించేందుకు సహకరించాలని రఘునందన్ రావు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed