వెంకట్రామిరెడ్డికి పట్టం కట్టండి

by Disha Web Desk 15 |
వెంకట్రామిరెడ్డికి పట్టం కట్టండి
X

దిశ, పటాన్ చెరు : సమర్థుడు, పరిపాలన అనుభవం కలిగిన వెంకట్రామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పటాన్​చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధితో పాటు రామచంద్రపురం, భారతినగర్ డివిజన్లలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ..ఈనెల 27న లక్ష్మీ గార్డెన్స్ లో రామచంద్రపురం, భారతి నగర్ డివిజన్ల ముఖ్యనాయకుల సమావేశం, 28న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు

చేసిన అమీన్పూర్ మున్సిపల్, మండల స్థాయి మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై, విజయవంతం చేయాలని కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలులో విఫలం చెందుతున్న తీరును ప్రజలకు వివరించాలని కోరారు. మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాను పటాన్ చెరు నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వాడినని.. తనను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమలలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, సపాన దేవ్, బాల్ రెడ్డి లతో పాటు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed