- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు జననీరాజనం
దిశ,వెల్దుర్తి : మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఘన స్వాగతం పలికారు. గురువారం మాసాయిపేట మండలంలోని రామంతాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బొమ్మారం, కొప్పులపల్లి, నెల్లూరు నుంచి వెల్దుర్తి వరకు నీలం మధు ప్రచార రథంతో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రచార రథం నుంచి నీలం మధు అభివాదం చేస్తూ
కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మహిళా విభాగం ఇన్చార్జి సుజాత సత్యం, సుహాసిరెడ్డి నీలం మధుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మిఆంజనేయులు, పార్టీ మాజీ మండలాధ్యక్షులు నరసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి మల్లేశం, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నాయకులు మల్లేశం చారి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.