బీడీ కంపెనీని తరలించవద్దు.. కార్మికుల ధర్నా..

by Sumithra |
బీడీ కంపెనీని తరలించవద్దు.. కార్మికుల ధర్నా..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : భాష బీడీ కంపెనీ తరలించవద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏసీఎల్ ఆఫీస్ ఎదుట హిందు మద్దూర్ సభ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి సుదర్శన్ రావు, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, సంఘం ప్రతినిధి ఈదారి మల్లేశం మాట్లాడుతూ బీడీ కంపెనీ అర్ధాంతరంగా తరలించడంతో కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక వేళ తరలిస్తే కార్మికులకు మూడు నెలల వేతనాలు, గ్రాట్యుటీ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీఎల్ శ్రీనివాస్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మధు, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, భాష బీడీ కంపెనీ టేకే దారులు వెంకటేశం, కృష్ణమూర్తి, బల్ల ప్రభాకర్, దుబ్బ రాజం, రవి, నర్సింలు, శ్రీను, ప్యాకర్స్ రాజేశం, శ్రీనివాస్, బీడీ కార్మికులు కనక లక్ష్మి, జయమ్మ, బాల మణి, లీలావతి, రాజేశ్వరి, లహరి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed