సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దారుణం

by Kalyani |
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దారుణం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: నెలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువును ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నవ జాత మగ శిశువును ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ నాటల్ వార్డు వద్ద వదిలి వెళ్లారు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది నవజాత శిశువును ఎన్ఐసీ వార్డులో అడ్మిట్ చేశారు. శిశువు 900 గ్రాములు మాత్రమే ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story