గాంధీ భవన్ లో ప్రారంభమైన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-15 09:08:26.0  )
గాంధీ భవన్ లో ప్రారంభమైన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ సంస్థాగత బలోపేతం...స్థానిక ఎన్నికలకు కేడర్ ను సన్నద్ధం చేసే లక్ష్యంతో నేటీ నుంచి పీసీసీ నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో ప్రారంభమయ్యాయి. నిర్ధేశించుకున్న షెడ్యూల్ మేరకు ముందుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎమ్మెల్యే రోహిత్ రావ్, ఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.

సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ భేటీ జరుగుతుంది. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరుతుంది. సాయంత్రం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్ల సమావేశం జరగనుంది.

Next Story

Most Viewed