నేటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

by M.Rajitha |
నేటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేశామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌‌రెడ్డి ప్రకటించారు. బుధవారం సాయంత్రం వరకు విద్యార్థుల నుంచి అబ్జెక్షన్లను స్వీకరించి, గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామన్నారు. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గతేడాది సంబంధించిన కాలేజీల సీట్ల అలా‌ట్‌మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ వివరాలను పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని, తద్వార ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని విద్యార్థులకు ఆయన సూచించారు.

Next Story

Most Viewed