చోరీకి యత్నించి.. గ్రామస్తుల చేతిలో హతం

by Rajesh |
చోరీకి యత్నించి.. గ్రామస్తుల చేతిలో హతం
X

దిశ, నవీపేట్ : నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్ద గ్రామంలో మూతపడ్డ పాత రైస్ మిల్లులో చోరీకి యత్నించి ఒకరు గ్రామస్తుల చేతిలో హతమయ్యారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలం పాల్ద గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఆరుగురు ఆటోలో వచ్చి రైస్ మిల్లులోని పాత సామాను దొంగిలించే ప్రయత్నం చేశారు. గమనించిన స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఐదుగురు ఆటోలో పారిపోగా ఒకరు గోడదూకి పొలాలలోకి పరుగెత్తగా గ్రామస్తులు వెంబడించి కర్రలతో దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న నవీపేట్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అతనిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బానోత్ సునీల్ (44) మృతి చెందాడు. దొంగతనానికి యత్నించిన వారు డిచ్ పల్లి మండలం సుద్ధపల్లి తండాకు చెందిన వారిగా గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా పాల్ద గ్రామంలో పోలీసులు రాత్రి ప్రత్యేక బృందంతో బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Next Story