బిర్యానీ బీర్ తాగినవా ఏంది..? ఐదు గంటలు నీటిలోనే మనిషి.. కానీ బతికాడు!

by Ramesh N |   ( Updated:2024-06-10 12:23:51.0  )
బిర్యానీ బీర్ తాగినవా ఏంది..? ఐదు గంటలు నీటిలోనే మనిషి.. కానీ బతికాడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హన్మకొండలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఇవాళ ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని.. బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండటం గమనార్హం. వెంటనే అతడిని పోలీసులు ప్రశ్నించగా.. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

పది రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటలు సేపు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. దీంతో అతని మాటలు విని స్థానికులు పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. హంటర్ లేదా బిర్యానీ బీర్ వేసినట్లున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గిట్ల ఉన్నరు ఏందిరా మనుషులు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed