నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మండల విద్యార్థులు

by Mahesh |
నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మండల విద్యార్థులు
X

దిశ, వీపనగండ్ల: మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి మెడికల్ కళాశాలలో సీట్లు పొందారు. సోమవారం విడుదలైన మెడికల్ కాలేజ్ ప్రవేశాలలో గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు జోల్లు గంగులు-శ్యామల కుమారుడు అఖిల్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో, మేడిపల్లి నాగేశ్వర్ రెడ్డి–లావణ్యల కూతురు యామిని రెడ్డి కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో, మునిగొండ గోపి–మాధవిల కూతురు అఖిలా సంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెన్నార్ మెడికల్ కళాశాలలో సీట్లను పొందారు. ఓకే గ్రామం నుండి ముగ్గురికి మెడికల్ కళాశాలలో సీట్లు రావడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు. వైద్యులుగా స్థిరపడి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం అని ఎంబిబిఎస్ సీట్లు పొందిన విద్యార్థులు అఖిల్, యామిని రెడ్డి, అఖిల అన్నారు.

Advertisement

Next Story

Most Viewed