వైద్యం కోసం ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

by Naveena |
వైద్యం కోసం ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే
X

దిశ, గద్వాల టౌన్ : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లక్ష 25వేల రూపాయల ఎల్ఓసి లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మెరుగైన వైద్య చికిత్స కోసం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. నల్లకుంట కాలనీ 21వ వార్డుకు చెందిన శ్రీహిత D/o నవీన్ కుమార్ కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన 1లక్ష 25 వేల రూపాయల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed