ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లతో బుద్ధి చెప్పాలి : డీకే అరుణ

by Disha Web Desk 11 |
ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లతో బుద్ధి చెప్పాలి : డీకే అరుణ
X

దిశ, మక్తల్: ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు తో బుద్ధి చెప్పాలి అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. నియోజకవర్గంలోని మాగనూరు మండలంలోని వడ్వాట్ గ్రామంలో గురువారం బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మక్తల్ నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు కొండయ్య ఆధ్వర్యంలో వడ్వాట్ గ్రామం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు అరుణమ్మ కు మదాసి కురువ సంఘం సభ్యులు వారి సాంప్రదాయ ప్రకారం గొంగళి కప్పి సన్మానించి, గొర్రె పిల్లను బహుకరించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు చేతకాని వారుకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రజా సంక్షేమ పాలనలో మోడీ ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా కాంగ్రెస్ అమలు చేయలేక పోయింది అని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసిన మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధిలోనూ కేంద్రం నిధులే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed