శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 7 గేట్లు ఎత్తిన అధికారులు

by Nagam Mallesh |
శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 7 గేట్లు ఎత్తిన అధికారులు
X

దిశ, అచ్చంపేట : కర్ణాటక రాష్టంలో భారీగా కురుస్తున్న కారణంగా ఎగువన జూరాల ప్రాజెక్టు నుండి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపంగా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు కు 3 లక్షలకు పైగా క్యూ సెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఎప్పటికి అప్పుడు వరద జలాలను అంచనా వేస్తూ బుధవారం ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగులు పైకి ఎత్తినప్పటికీ గురువారం మరింత వేగంగా ఎగువనున్న ఆల్మట్టి డ్యాం జూరాల ప్రాజెక్టుల నుండి కృష్ణమ్మ ఉరకలేస్తూ శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు, 215. 807 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.90 అడుగులకు చేరుకోగా, 215.807 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. జూరాల ప్రాజెక్టు 3.34 లక్షలకు పైగా క్యూసెక్కులు, జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20, 368 వేల క్యూసెక్కులు వస్తున్న నేపథ్యం లో మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 3.34,720 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 7 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగివల నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు 2.24, 600 క్యూసెక్కులు అలాగే తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 వేల క్యూసెక్కులు ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,925 వేల క్యూసెక్కులు మొత్తంగా 2.90 లక్షల క్యూసెక్కుల వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైపు ఉరకలేస్తుంది. ఎగువ నుండి మరింత వరద నిరంతరాయంగా కొనసాగితే అధికారులు మరిన్ని గేట్లు ఎత్తేందుకు అప్రమత్తంగా ఉన్నారు. తెలంగాణ ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed