శభాష్ కానిస్టేబుల్ రాందాస్

by Disha Web Desk 11 |
శభాష్ కానిస్టేబుల్ రాందాస్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలోని నల్లమల లోతట్టు ప్రాంతంలో సలేశ్వరం జాతర ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగాయి. ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఈ క్రమంలో చివరి రోజు లింగమయ్య దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు దర్శనం అనంతరం కొండపైకి ఎక్కలేక అవస్థలు పడుతున్న స్థితి.. అచ్చంపేట సీఐ రవీందర్ దృష్టికి వచ్చింది. దీంతో సీఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ రాందాస్ తన భుజాలపై సుమారు 80 సం. వయస్సు గల వృద్ధురాలిని కొండపైకి తీసుకువచ్చి సురక్షితంగా పంపించారు. సామాజిక మాధ్యమాలలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు కానిస్టేబుల్ రామదాసు పై అభినందనల వర్షం కురిపించారు.



Next Story

Most Viewed