రాష్ట్రీయ స్వయంసేవ శతాబ్ది ఉత్సవం

by Naveena |
రాష్ట్రీయ స్వయంసేవ శతాబ్ది ఉత్సవం
X

దిశ,దేవరకద్ర: దేవరకద్ర మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవ శతాబ్ది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర పట్టణ కేంద్రంలో వందల సంఖ్యల్లో స్వయం సేవకులు పూర వీధుల గుండా రూట్ మార్చు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి శతాబ్ది ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్ శివశంకర్,సేవా భారతి జిల్లా అధ్యక్షులు కోట్ల రాందేవ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్ శివశంకర్ మాట్లాడుతూ.. 1925లో విజయదశమి రోజున ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ విజయదశమితో శతవంసంతం లోకి అడుగుపెట్టిందని అన్నారు. ఈ 99 సంవత్సరాల్లో దేశంలో హిందూ సంఘటన చేస్తూ దేశంలో ఉన్న ప్రజలలో జాతీయ భావన దేశభక్తి భావాలను పెంపొందించిందని అన్నారు .దేశంలోని లక్షలాది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి,దేవరకద్ర ఖండ కార్యనిర్వాకులు బాలకృష్ణ నర్సింలు ,సురేష్ ,భాస్కర్ చంద్రయ్య, చెన్నారెడ్డి ,సుధాకర్ రెడ్డి , తిప్పారెడ్డి,నిరంజన్ రెడ్డి రఘువీర్ ,కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story