కాంగ్రెస్ లో చేరిన ప్రదీప్ గౌడ్

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ లో చేరిన ప్రదీప్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత ప్రదీప్ గౌడ్ గురువారం తిరిగి.. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనుచర వర్గం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రదీప్ గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నాలు సాగించారు. అవకాశం లభించకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారి బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన విషయం పాఠకులకు విదితమే..!

శ్రేయోభిలాషులు, హితుల విజ్ఞప్తులు, చేరికల కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన గాంధీభవన్ లో చేరిక కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రదీప్ గౌడ్ పార్టీలో చేరిన విషయం సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుండడంతో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి లోపు ప్రదీప్ గౌడ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో ఎమ్మెల్యే అనుచరులు పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది ప్రదీప్ గౌడ్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారంతో ప్రదీప్ గౌడ్ ను అడ్డుకోవడానికి బయలుదేరినట్లు సమాచారం.



Next Story

Most Viewed