పేకాట రాయుళ్లు అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

by Y.Nagarani |
పేకాట రాయుళ్లు అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
X

దిశ, పెబ్బేరు: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామంలో ఎన్ కె ఆర్ గోదాంలో పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పెబ్బేరు ఎస్ ఐ హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో పేకాట స్థావరం పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మరియు వనపర్తి పోలీసులు సంయుక్త దాడి చెసి పేకాట ఆడుతున్న 15 మందిని పట్టుకొని వారి నుండి 6,35,600 రూపాయల నగదు, 4 కార్లు, 3 బైక్ లు, 15 మొబైల్స్ స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.

15 మంది అరెస్ట్ కేసు నమోదు

జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్ రెడ్డి ఆద్వర్యంలో ఇటిక్యాల ఎస్సై వెంకటేష్ , ఎస్బి సిబ్బంది, మరియు వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి 15 మందిని అరెస్టు చేసి 6,35,600/- రూపాయాల నగదు, 4 కార్లు, 4 బైక్ లు,15 మొబైల్స్ పోన్ లు స్వాధీనం చేసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పల్లె వెంకటయ్య (గుడ్డందొడ్డి ధరూర్), గుంజపల్లి వీరేష్, ఆంజనేయులు, అశోక్, ఉప్పరి గోపాల్, జలీల్ భాషా, పాడ రామిరెడ్డి, సత్య స్వరూప్, కూర్వ వీరన్న, కృష్ణయ్య, రంగాపురం, వెంకటన్న, నాగిరెడ్డి, పెబ్బేరు, నరసింహరెడ్డిలను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed